మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద లబ్ధిదారులకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చింతల్ డివిజన్ కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఎల్వోసీ పత్రాల అందజేతలో భాగంగా చింతల్ డివిజన్ కు చెందిన టీ. విజయలక్ష్మీ భర్త టీ.సురేష్ కు రూ. 1,25,000/-(ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు) మంజూరు కాగా లబ్దిదారులకు మాజీ కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ, సీనియర్ నాయకులు బస్వరాజ్, కే.పీ వెంకటేష్, శేఖర్ రావు, ఆకుల ప్రభాకర్ గుప్తా, సామ్రాట్ లు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.