MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 7:48 pm Posted by : MANA TOLIVELUGU

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి 

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మిధాని డిపో మజ్దూర్ యూనియన్ అధ్యక్షులుగా పర్వతాలు నేత ఎన్నియ్యారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, జోనల్ సెక్రటరీ ఆర్. ఎన్. రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా మిధాని డిపో కమిటీ వేశారు. అధ్యక్షుడుగా పర్వతాలు నేత, కార్యదర్శిగా తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీద్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ లుగా ఐలయ్య, ఎస్.ఎం. రెడ్డి, చంద్రు, ట్రెజరర్ గా వెంకటయ్య గౌడ్, చీఫ్ అడ్వైజర్ గా స్వామి గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.