MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 6:52 pm Posted by : MANA TOLIVELUGU

ఎండ తీవ్రతతో దాహం తీర్చుకుంటున్న వానరం

 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

 

ఎండ తీవ్రత పెరిగిన ఈ సమయంలో మనుషులతో పాటు మూగజీవాలు కూడా దాహానికి తల్లడిల్లుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యం అర్చకులు, కులకర్ణి లక్ష్మీ వెంకట నరసింహరావు ఇంట్లోకి వెళ్ళి ఆయన చేతిలో నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకొని వానరం తన దాహం తీర్చుకుంది. మనం పారేసే చిన్న వస్తువు కూడా ఒక మూగజీవికి ప్రాణం పోయగలదు. ఎండాకాలంలో కాస్త నీళ్లు, బయట పెడితే చాలు పక్షులు, కుక్కలు, కోతులు వంటి జీవాలకు అది పెద్ద ఊరట, మన చిన్న సహాయం వాటికి పెద్ద ఉపశమనం.