కుక్కల కోసం నీళ్లతోట్ల ఉచిత పంపిణీ
ఎల్బీనగర్ : వేసవిలో కుక్కల దాహం తీర్చితే కరుస్తాయని భయం ఉండదు కాబట్టి ప్రకృతి ఆగ్రహించకుండా జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముత్తు లచ్చిరెడ్డి కొనియాడారు. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేశారు.