ఖాజాఖాన్ ను పరామర్శించిన కోలన్ శంకర్ రెడ్డి 

మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  రంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా మాజీ ప్రెసిడెంట్ ఖాజాఖాన్ అనారోగ్య బారిన పడ్డాడు. బీజేపీ కో - ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి ఖాజా ఖాన్ ను అతని స్వగృహం పహాడీషరీఫ్ లో ఆయనను కలిసి పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. వైద్యులు సూచించిన ప్రకారము ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ సమయానికి మందులు వాడాలన్నారు. త్వరగా కోలుకుంటారని, కోలుకోవాలని ఆకాంక్షించారు.