MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 10:59 pm Posted by : MANA TOLIVELUGU

జడ్జిపై పోస్ట్ పెట్టిన నిందితుడు అరెస్ట్

TG: బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవి దేవిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే సదరు న్యాయమూర్తి భర్తకు బార్ అసోసియేషన్ చైర్మన్ పదవి దక్కుతుందంటూ దామోదర్ నెట్టింట అసత్య ఆరోపణలను ప్రచారం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న ఈ పోస్టులపై హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు దామోదర్ ను అదుపులోకి తీసుకున్నారు.