మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జల్ పల్లి డివిజన్ 65 లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సంబరాల్లో ముఖ్య నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, యంజాల జనార్దన్, వాసు బాబు, యంజావ అర్జున్, సుభాష్, నగేష్ ముదిరాజ్, భూషణం, నవపేట ఆంజనేయులు, అబ్బాస్, శంకర్, సాదిక్, నవీన్ మహిళా నాయకురాలు పద్మ, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన గులాబీ జెండా నీడన, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో డివిజన్ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు డివిజన్ ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు, గులాబీ సైనికులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.