MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 7:24 pm Posted by : MANA TOLIVELUGU

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ డివిజన్ లో మహిళలకు ఆమె చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు గౌడ్, టేకుల శశిధర్ రెడ్డి, పగడాల ఉమేష్, అరవింద్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.