నెలల తరబడి కొనసాగుతున్న రోడ్డు పనులు
ప్రజలకు తీవ్ర ఇబ్బందులు మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : ఛత్రినక చౌరస్తా నుండి ఉప్పుగూడ వెళ్ళే ప్రధాన రహదారిలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న మరమ్మత్తు పనుల వల్ల స్థానికులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పూర్తిగా తొవ్వడంతో, రాళ్లు, మట్టి కుప్పలు పడి ఉన్నాయి. కాంట్రాక్టర్లు చేస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధూళి, దుమ్ము, బురద వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ జామ్...