MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:53 pm Posted by : MANA TOLIVELUGU

ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ : 

ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సహకారంతో మంజూరు కావడం పట్ల, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కురుమ సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కుర్మ సంఘ అధ్యక్షులు బట్ట బాలకృష్ణ, సూరారం విలేజ్ చైర్మన్ బట్ట నర్సింహా, ఆలయ అధ్యక్షులు బాలయ్య, పెంటయ్య, సెల్వియోజి సత్తయ్య, చిన్న సత్తయ్య, బాలరాజ్, కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.