మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ డివిజన్ తుక్కుగుడా మాజీ కౌన్సిలర్ బాధావత్ రవి నాయక్ సోదరుడు బాధావత్ శ్రీనివాస్ నాయక్ కుమారుడు బాదవత్ ప్రదీప్ నాయక్ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి తుక్కుగుడా చేరుకొని ప్రదీప్ పార్థివ దేహంపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతదేహాన్ని చూసి చలించిపోయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రదీప్ మృతి శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, యూత్ ప్రెసిడెంట్ సామెల్ రాజ్, మాజీ కౌన్సిలర్ సప్పిడి రాజు ముదిరాజ్, మాజీ ఎంపీపీ సురేష్, ఉప్పునుంతల శీను, సుధాకర్ గౌడ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.