మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిత్యం ప్రజా సేవ చేసుకుంటూ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకున్నారు.