ఎల్బీనగర్ : యువజన & క్రీడా వారోత్సవాలలో భాగంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నుండి కొత్తపేట్ వరకు నిర్వహించిన 5KM మారథాన్ రన్ ను TGRDC ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (IAS) డాక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి, గడ్డిఅన్నారం AMC డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, DYSO ఎస్. స్వర్ణలత, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.