రంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా రేవతి రెడ్డి

రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విద్యాశాఖ అధికారుల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన విద్యాశాఖ అధికారిణి (డీఈఓ) గా రేవతి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేవతి రెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈఓ) గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా డీఈవో గా విధులు నిర్వహించిన సుశీందర్ రావు నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు.