MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 1:13 pm Posted by : MANA TOLIVELUGU

శ్రీ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్న చిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

పెళ్లి రోజుకు ప్రతి ఒక్కరీ జీవితంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్, చిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రతం చేశారు.శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. శతమానం భవతి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా జీవించమని బ్రాహ్మణ పండితులు దీవించారు.

చిగురింత పారిజాత నరసింహారెడ్డి దాంపత్య జీవితం ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పలువురు నాయకులు వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.