మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :
మున్సిపల్ వార్డులలో సమస్యల పరిష్కారానికై వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 14, 15, 17, 18, 19, 21, 25, 28, 30, 32 వార్డులలో జరిగిన ముగింపు కార్యక్రమాలలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్ లు, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.