MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:11 pm Posted by : MANA TOLIVELUGU

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం 

ఎల్ఓసీని అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బాలాపూర్ గ్రామ వాస్తవ్యులు అయిన శంకరమ్మ కి 1,50,000 లకు సంబంధించిన ఎల్ఓసీని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆమెకు అందజేశారు. సీఎం సహాయనిధిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాగ్యనగర్ సొసైటీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, జుకంటి సురేష్ గౌడ్, కందికంటి అరవింద్ గౌడ్,జీ. విజయ్ తదితరులు పాల్గొన్నారు.