హైదరాబాద్‌లో ఎబోలా కలకలం

సూడాన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కనుగుల సాయికిషోర్ : హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్‌ అనుమానిత కేసు కలకలం రేపింది. సూడాన్‌ దేశం నుంచి గురువారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) శంషాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో వైద్య పరీక్షల సందర్భంగా ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని గుర్తించిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక అంబులెన్స్‌లో అతడిని గాంధీ...