మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
భువనగిరి పట్టణంలో సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన, నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా సహకారంతో క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగేళ్ళపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మాట్లాడుతూ.. ఈ క్యాంపు వల్ల గత 2 సంవత్సరంల నుండి దాదాపు నల్లగొండ జిల్లాలో 12 మంది, లీగ్ కు 5 మంది స్టేట్ కు కావడం జరిగిందన్నారు. ప్రతిభ చూపిన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులు రోహిత్, క్రాంతి, లక్ష్మణ్, వేణు, మహేష్ అభినందించారు. ఇంచార్జి అబోతుల కేతన్, కోచ్ సతీష్ లు సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.