మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
భువనగిరిలో ఘనంగా పల్స్ పోలియో
చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :
పట్టణంలోని వివిధ వార్డుల్లో పల్స్ పోలియో కార్యక్రమం శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ 35, 10, 18 వ తదితర వార్డుల్లో ఉన్న పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. ప్రతి కేంద్రంలోనూ 5 సంవత్సరాల లోపు చిన్నారులకు చైర్ పర్సన్ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ.. పోలియో వ్యాధి శాశ్వత వైకల్యానికి కారణమవుతుందని, దీన్ని పూర్తిగా రూపుమాపడమే మనందరి ధ్యేయమన్నారు. ప్రతి ఇంట్లోని 5 సంవత్సరాల లోపు బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఏ ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదన్నారు. భువనగిరిని 100 శాతం పోలియో రహిత పట్టణంగా చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవి కుమార్, స్థానిక కౌన్సిలర్లు పాశం అమర్, బింగి నరేష్, యాస్మిన్, స్థానిక నాయకులు పలువురు మహిళలు, చిన్నారులు, పోలియో నిర్వహణ సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

