మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (30 జూలై 2026) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాలు ఆగస్టు 2వ తేదీన తుక్కుగూడలో జరగబోయే మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని, బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డిని తుక్కుగూడ మాజీ కౌన్సిలర్లు సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్, రవి నాయక్, మాజీ ఎంపీపీ సురేష్, మహేశ్వరం మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పునూతల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేను కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

