మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
భువనగిరి పట్టణంలోని 7వ వార్డు హనుమాన్ వాడలో అగర్వాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ అగర్వాల్ బృందం వార్డు ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుక్కదూవు పద్మావతి సోమయ్య, ఆశ వర్కర్లు నీల పద్మ, తొర్ర గణేష్, బర్ల ఉప్పలయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

