మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవల్లి సోషల్ మీడియా కన్వీనర్ చిట్టి రాజుల నరసింహ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: చిట్టి రాజుల నరసింహ
0
16
Previous article
Next article

