మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభమైన జనగణన కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ సూచించారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న జనాభా లెక్కల ప్రక్రియను ఆకస్మికంగా డిప్యూటీ కమిషనర్ బీ. వెంకట్రామ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు రూపొందించిన మ్యాప్లను జోనల్ కమిషనర్ పరిశీలించి, ఎన్యుమరేటర్లు , సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం జల్పల్లి సర్కిల్ పరిధిలోని క్యూబా కాలనీ, వాది-ఏ-సలామ్ కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బి. వినయ్ కుమార్, ఈఈ శ్రీనివాస్, ఏఈ సుధాకర్, వినీత్, శానిటరీ ఇన్స్పెక్టర్ మొయిన్ బాబా, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

