ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయాకులకు అన్నప్రసాద పంపిణీ

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయాకులకు అన్నప్రసాద పంపిణీ

📰 Generate e-Paper Clip

నాగర్ కర్నూల్ పూజారి బూర్గుల నరసింహారావు సేవాతత్పరత

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ ప్రతినిధి విజయ్ కాంత్   

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కు చెందిన బూర్గుల నరసింహారావు 2014 నుండి ప్రతి నెలలో ఒకరోజు రోగి సహాయకులకు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దత్త జయంతి, కార్తీక పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి ప్రత్యేక రోజులలో తప్పని సరిగా నెలలో ఏదైనా ఒక రోజు 150 మందికి రోగి సహాయకులకు అన్నప్రసాదం, స్వీట్లు, మజ్జిగ, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వైశాఖ అమావాస్య పురస్కరించుకొని శనీ వారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద పంపిణీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహతి, తులసి శర్మ , ఆదర్శ శర్మ, మల్లికార్జున్, రాము, గురునాథ్ గౌడ్, హెల్ప్ డెస్క్ఇంచార్జ్ టీ. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!