మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మీర్ పేట్ డివిజన్ కమల నెహ్రూ నగర్ కాలనీ లోని ముత్యాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ పుణ: ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇంచార్జ్ మహేశ్వరం నియోజకవర్గ కాంటెస్ట్ ఎంఎల్ఏ అందెల శ్రీ రాములు పాల్గొన్నారు.
కమిటీ సభ్యుల గ్రామ పెద్దలు
శివ శంకర్, దయానంద్, కుమార్, అంజన్, కృష్ణ, శ్రీకాంత్, శివ ఇతర సభ్యులు అందేల రాములు కి బీజేపీ నాయకులకు ప్రత్యేక పూజలు చేయించి తర్వాత శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సిద్దాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, అనిత, సోమేశ్వర్, గాజుల మధు, తులసి వెంకటేశ్వర్లు, గోపీనాథ్, రమేష్, మల్లికార్జున్, రాఘవేంద్ర, వంటేరు నరసింహ రెడ్డి, రవీందర్ రెడ్డి, రఘు, శశి, శ్రీను, నిఖిల్, పవన్, భారత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
