రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విద్యాశాఖ అధికారుల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ) గా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా డీఈఓగా విధులు నిర్వహించిన సుశీందర్ రావు మరో జిల్లాకు బదిలీపై వెళ్లరున్నారు.
రంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా వెంకటేశ్వర్లు
0
25
Previous article
Next article

