ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఫ్యూచర్ సిటీలో.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యం

ఫ్యూచర్ సిటీలో.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవానికి తరలివస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని పున్న గణేష్ నేత కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్, ఎన్టీఆర్ నగర్ డివిజన్, సరూర్ నగర్ డివిజన్, డాక్టర్స్ కాలనీ డివిజన్ ల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో కొత్తపేటలోని ‘పాపడం బ్లూ’ హోటల్‌లో ముఖ్య కాంగ్రేస్ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఉమ్మడి రామకృష్ణాపురం కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని మహేందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. 10వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్, చిలక ఉపేందర్ రెడ్డి,ఎ ఏం సి డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, దయాకర్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, చిక్కుల్ల శివప్రసాద్, సురేష్, తలాటి రమేష్ నేత ,ముప్పిడి లింగస్వామి గౌడ్, జెల్ల జగన్నాథం,రామకృష్ణ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, భూపాల్ రెడ్డి యాదవ రెడ్డి,రాజు నాయక్, పగడాల ఎల్లయ్య,గుల్షన్, శ్రీనివాస్, శ్రీనివాస్ రావు , యూనుస్ ,దుబ్బాక శేఖర్, మహమ్మద్,అంజి రెడ్డి, దోర్నాల చంద్రమౌళి, మల్లేష్ యాదవ్, జ్ఞానేశ్వర్ యాదవ్,శేఖర్ ముదిరాజ్, పగడాల శ్రీశైలం,అల్లేటి కిరణ్,జంగారెడ్డి రెడ్డి, కిషోర్, సుదర్శన్, రమేష్ గౌడ్, భాస్కర్, అచ్చయ్య, షఫీ, పాష, రంజిత్, రేణుక, అరుణ, సుజాత రెడ్డి, సంగీత, మాధవి మమత , లావణ్య, రామ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!