ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎనుపోతుల కురుమయ్య ఎన్నిక

డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎనుపోతుల కురుమయ్య ఎన్నిక

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

జిల్లా కేంద్రంలో జరిగిన భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీ.వై.ఎఫ్.ఐ) మహాసభలలో జిల్లా ఉపాధ్యక్షునిగా ఎనుపోతుల కుర్మయ్య ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం విడుదల చేయాలని ఆయన కోరారు. యూత్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలనీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వం వేసిన 60 వేల ఉద్యోగాలను అమలు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక ఉద్యోగం కూడా వెయ్యలేదు అని విమర్శించారు. యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోతే రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉదృతంగా చేస్తామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!