మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అమరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి యేల్మేటీ, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ క్యారగారి శ్రీధర్, రావుల లింగం, గణేష్, ధనరాజ్ గౌడ్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

