మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
సీఎం సహాయనిధిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్ పేట్ 60వ డివిజన్ సత్యసాయి నగర్కు చెందిన ముదిగొండ శేఖర్ తండ్రి అంజయ్య అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద మంజూరైన రూ.19,500 చెక్కును మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మదారి రమేష్, శీను నాయక్, విజయ్, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, సునీత, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

