ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిబాదవత్ ప్రదీప్ నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బాదవత్ ప్రదీప్ నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ డివిజన్ తుక్కుగుడా మాజీ కౌన్సిలర్ బాధావత్ రవి నాయక్ సోదరుడు బాధావత్ శ్రీనివాస్ నాయక్ కుమారుడు బాదవత్ ప్రదీప్ నాయక్ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి తుక్కుగుడా చేరుకొని ప్రదీప్ పార్థివ దేహంపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతదేహాన్ని చూసి చలించిపోయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రదీప్ మృతి శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, యూత్ ప్రెసిడెంట్ సామెల్ రాజ్, మాజీ కౌన్సిలర్ సప్పిడి రాజు ముదిరాజ్, మాజీ ఎంపీపీ సురేష్, ఉప్పునుంతల శీను, సుధాకర్ గౌడ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!