శ్రీ బాలసుబ్రమణ్య స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న పోలే శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ
మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్
సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ బాలసుబ్రమణ్య స్వామి దేవాలయంలో 3వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా 130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ లు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ, తమిళ సంఘం చైర్మన్ కోటస్వామి శాలువాతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడపా శేషు, చిన్న స్వామి, ముత్తు, నంద్యాల మోహన్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

