మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ వెరిఫికేషన్ కార్యక్రమంలోడివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షులు నేతి రాజు సంబంధిత అధికారు లతో తో కలిసి బూత్లను సందర్శించి ఓటర్ల పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు తదితర వివరాల సవరణ, కొత్త ఓటరు నమోదు విధానం, అవసరమైన పత్రాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే స్థానిక అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు కలిసి అధికారులకు లకు పూర్తి సహకారం అందించి ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశరు. ఇతర బస్తీల్లో నివసిస్తున్న ఓటర్ల వివరాల సేకరణలో కూడా ప్రతి ఒక్కరూ సహకరించి వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ నాయకులు సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోషన్ తదితరులు పాల్గొన్నారు.

